Politics

కేటీఆర్ పై షర్మిల విమర్శలు….

కేటీఆర్ పై షర్మిల విమర్శలు….

కేటీఆర్‌ కు తల పొగరు హిమాలయాలకు పాకిందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ షర్మిల. ప్రజాదర్భార్ పెట్టవద్దట! ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పుకోవద్దట! అట్ల చేస్తే వ్యవస్థలో లోపం ఉన్నట్లట! లోపం వ్యవస్థలో కాదు కేటీఆర్ గారు..మీ చేతకాని పాలనే తెలంగాణకు పెద్ద లోపం అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజా దర్బార్ చేయాలంటే ప్రజలకు మంచి చేస్తామన్న నమ్మకం ఉండాలని..ప్రజల సమస్యలు తీర్చాలని మంచి మనసు ఉండాలని కోరారు.

ప్రజల మధ్య దర్బార్ పెట్టాలంటే దమ్ముధైర్యం ఉండాలని.. అది లేకనే తొమ్మిదేండ్లుగా ఫామ్ హౌజ్ కే పరిమితం అయింది మీ పాలన అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించునట్లు ఉపన్యాసాలు ఇచ్చినా జనం నమ్మే స్థాయిలో లేరని.. అందుకే మీరు ఎక్కడ పర్యటిస్తే అక్కడ మీ కార్లను వెంబడించి కొడుతున్నారు జనం అంటూ నిప్పులు చెరిగారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ నిలదీస్తున్నారు.చేతకాని దద్దమ్మలు అని తిడుతున్నారని.. తెలంగాణ రాష్ట్ర సంపదను పందికొక్కులా మెక్కుతూ, జనం ఏమైపోతే మాకెందని చూసే దద్దమ్మలు మీరు.. పింఛన్, రేషన్ కార్డ్, పాస్ బుక్ లో పేరు మార్పు కోసం ముఖ్యమంత్రి వద్దకు రావొద్దట! అంటూ ఓ రేంజ్‌ లో చెలరేగారు షర్మిల.