Politics

ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నా తమిళిసై వ్యాఖ్యలు….

ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నా తమిళిసై వ్యాఖ్యలు….

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలు బయటకు చెప్పడానికి రావాలని పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులపై ఆడపిల్లలకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలని తమిళిసై సూచించారు. ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరగాలని అన్నారు.

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడతాయని.. ఈ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని అన్నారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్టుగా గవర్నర్ తమిళిసై చెప్పారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని తెలిపారు. అలాగే అన్ని అవరోధాలను దాటగలుగుతున్నానని చెప్పారు.