Movies

రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ…..

రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ…..

తన పర్యటనలో అమిత్ షా రాజకీయేతర ప్రముఖులతో సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించనున్నట్లు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ కానున్నారు. ఇప్పటికే అమిత్ షా ఆర్ఆర్ఆర్ హీరోలు అయినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. అమిత్ షా వరుసగా సెలబ్రిటీలు, ప్రముఖులను కలుస్తుండటంతో బీజేపీ వ్యూహాలు ఏమిటీ? అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కేవలం రాజకీయ మైలేజీ కోసమా? బీజేపీ పబ్లిసిటీ కోసమా? హిందూత్వ ఎజెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసమా? అనేక అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ తో భేటీ కావడం వెనుక పలు రాజకీయ కారణాలున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 14న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 15 తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలంకు వెళ్తారు. మధ్యాహ్నం 2.20 నుంచి 3.20 గంటల వరకు సీతారాములను దర్శించుకుంటారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటారు.రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9:30 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.