Business

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. ఆ తర్వాత చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 63,143కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 18,716 వద్ద స్థిరపడింది.