Business

కర్ణాటక:త్వరలోనే పెరగనున్న మద్యం ధరలు

కర్ణాటక:త్వరలోనే పెరగనున్న మద్యం ధరలు

కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల హామీల అమలుకు ఖజానాపై భారీ స్థాయిలో భారం పడనున్న పరిస్థితుల్లో.. ఆదాయం పెంచుకునే దిశగా ఈ బడ్జెట్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ప్రధానంగా ఆదాయ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.బడ్జెట్​లో భాగంగా ఇండియన్ మేడ్ లిక్కర్​పై ఎక్సైజ్ డ్యూటీని కర్ణాటక​ ప్రభుత్వం 20 శాతం పెంచింది. బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం పెంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 18 స్లాబ్​ల్లో అదనంగా 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. ఈ పెంపు తరువాత కూడా కర్ణాటకలో లిక్కర్ ధరలు పొరుగు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉంటాయని సిద్ధరామయ్య తెలిపారు.