Movies

చంద్రబాబును కలిసిన మంచు మనోజ్ దంపతులు

చంద్రబాబును కలిసిన మంచు మనోజ్ దంపతులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని సినీ నటుడు మంచు మనోజ్‌ దంపతులు ) కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి సతీ సమేతంగా వచ్చిన ఆయన దాదాపు 45 నిమిషాల పాటు కలిసి మాట్లాడారు. కుటుంబ వ్యవహారాలు, రాజకీయ అంశాలపై చంద్రబాబుతో మనోజ్ దంపతులు చర్చించినట్లు సమాచారం. త్వరలో ఎన్నికల రాబోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మనోజ్‌, మౌనికల రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వాటన్నింటికీ మనోజ్‌ స్పష్టత ఇచ్చారు.ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. మేమంటే ఎంతో అభిమానం. భూమా మౌనికతో నా వివాహం తర్వాత ఆయన్ను కలవాలనుకున్నాం. కానీ, కుదరలేదు. ఈలోగా బాబుగారు కూడా కాస్త బిజీ అయ్యారు. ‘నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం’ అని చెప్పారు. ఈ రోజు ఉదయం ఫోన్‌ చేసి రమ్మంటే, వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాం. మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాం. రాజకీయాల్లోకి ప్రవేశంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుంది’’ అని పేర్కొన్నారు.