Politics

21న ఏపీకి బండి సంజయ్

21న ఏపీకి బండి సంజయ్

ఏపీ బీజేపీలో ఉత్సాహం నింపేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్నాళ్ల పాటు ఏపీ బీజేపీకి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సేవలు వాడుకోవాలని నిర్ణయించింది. ఇందుకు బండి సంజయ్ కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 21న జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతి రానున్నట్లు తెలుస్తున్నది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియపై బండి సంజయ్ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తున్నది.