Fashion

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే…పిల్లల నుండి ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే…ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు

ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్‌ హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రాసే సెటిల్‌మెంట్‌ దస్తావేజులో ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు పేర్కొంటే, ఆ పిల్లలు తమకు హామీ ఇచ్చిన విధంగా తమ సంరక్షణ బాధ్యతలను నెరవేర్చకపోతే, ఆ ఆస్తిని ఏకపక్షంగా తిరిగి ఆ తల్లిదండ్రులు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ ఎస్‌ ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.