Politics

పవన్ సంగతి ఢిల్లీకి చెప్తాం: పురందేశ్వరి

పవన్ సంగతి ఢిల్లీకి చెప్తాం: పురందేశ్వరి

జనసేనతో పొత్తుపై భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) స్పందించారు. తమ పార్టీతో పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఆలోచనల గురించి పవన్‌ కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని ఆమె తెలిపారు. తమది జాతీయ పార్టీ అని.. పవన్‌ అభిప్రాయంపై తాము వెంటనే స్పందించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పారు.