NRI-NRT

దోహాలో మెగా మ్యూజికల్ నైట్

దోహాలో మెగా మ్యూజికల్ నైట్

దోహా మ్యూజిక్ లవర్స్-ఎమ్ పాల్ రికార్డ్స్ ఆధ్వర్యంలో దోహాలో “మెగా మ్యూజికల్ నైట్” నిర్వహించారు. దోహా మ్యూజిక్ లవర్స్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫీ, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ నుండి ప్రతిభావంతులైన గాయకులను కలిగి ఉన్న తన గ్రూప్ యొక్క అంతర్జాతీయ కూర్పు గురించి మాట్లాడారు. ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. రఫీ, ఎమ్ పాల్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు మొహిందర్ జలంధరిలు సంగీతం పట్ల చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

ప్రసిద్ధ పంజాబీ గాయకుడు గారి సింగ్ పంజాబీ పాటలను అద్భుతంగా ఆలపించి అలరించారు. ఆంధ్రకళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మధు, ICBF శంకర్ గౌడ్, RJ కబీర్, యావర్ హుస్సేన్; సోను దోహా కాంట్రాక్టింగ్, లోకేష్ వాలియా, జ్యోతి, లుత్ఫీ ఖాన్ కాకర్, జవీద్ బజ్వా, సారా అలీఖాన్, మధు వంటేరు, దివ్య గోపి, అస్లాం చెనియేరి, బాసిత్ ఇంతియాజ్, షబాన్ నఫీస్, రోనీ ఖాన్, విమలేష్, మనీష్, శ్రావ్య, జోషితా దుర్గు, సాక్షి సుఖ్నాని, వందనా రాజ్, శివాని, తరంగిణి, ధన్య ప్రియ, రేష్మ, ఫెలిక్స్, ఫ్రాంగో తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z