Business

వచ్చే ఏడాది నుంచి టాటా కార్ల ధరల పెంపు

వచ్చే ఏడాది నుంచి టాటా కార్ల ధరల పెంపు

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata motors) తమ ప్యాసింజర్‌ వాహన ధరలు (Price hike) పెంచనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పెంపు చేపట్టనున్నట్లు తెలిపింది. విద్యుత్‌ వాహన (EV) ధరలూ పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత మేర పెంచేదీ టాటా మోటార్స్ పేర్కొలేదు.‘‘జనవరి నుంచి ప్రయాణ, ఎలక్ట్రిక్‌ వాహన ధరలు పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. పెంపు మొత్తం, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నాం’’ అని టాటా మోటార్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే మారుతీ సుజుకీ, ఆడీ కంపెనీలు ధరల పెంపుపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్‌ ఇప్పుడే ఆ జాబితాలో చేరింది. దేశీయంగా టాటా మోటార్స్‌ టియాగో నుంచి సఫారీ వరకు వివిధ శ్రేణుల్లో వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z