ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ (Gautam adani) తన మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ (IANS) ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను కొనుగోలు చేశారు. ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. అదానీ గ్రూప్నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ద్వారా 50.50 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఈ మేరకు అదానీ గ్రూప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
గతేడాది మార్చిలో బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ అందించే క్వింటిలియన్ బిజినెస్ మీడియా కొనుగోలుతో మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. అదే ఏడాది డిసెంబర్లో ఎన్డీటీవీలో (NDTV) 65 శాతం వాటాను చేజిక్కించుకున్నారు. తాజాగా ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఏఎన్ఎస్ ఆదాయం రూ.11.86 కోట్లుగా ఉంది. తాజా కొనుగోలు ద్వారా ఐఏఎన్ఎస్ కార్యకలాపాలు, మేనేజ్మెంట్ వ్యవహారాలను ఇకపై ఏఎంఎన్ఎల్ చూడనుంది. అలాగే ఐఏఎన్ఎస్తో డైరెక్టర్లను నియమించే హక్కులు దఖలు పడినట్లు ఆ కంపెనీ పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –