NRI-NRT

డీసిలో యువగళం విజయోత్సవ సభ

డీసిలో యువగళం విజయోత్సవ సభ

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సి.. వేదికగా..

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎన్నారైలు, పార్టీ అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 27న రాయలసీమ కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేడు ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలోని అగనంపూడి వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల నీరాజనాలతో ముందుకు సాగిందని.. ప్రజల సమస్యలను అవగతం చేసుకుంటూ, ఒక యువకుడిగా నారా లోకేశ్‌ యువగళం జనగళమై, నవ యువ శకానికి నాంది అంటూ అభిప్రాయపడ్డారు..

ప్రభుత్వం.. లోకేష్ పాదయాత్ర చుట్టూ పలు అడ్డంకులు సృష్టించినా, తండ్రిని అక్రమ అరెస్ట్ చేసినా కూడా.. చెక్కు చెదరని సంకల్పంతో, ప్రజామోదంతో సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని, అంతిమంగా ఈ ముగింపు సభ రాబోతున్న ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శంఖారావమని.. చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరమని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో.. సతీష్ వేమన, భాను మాగులూరి, నాగ్ నెల్లూరి, యాష్ బొద్దులూరి, మురళీధర్ గౌడ్, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, భాను వలేటి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z

TANA 2023 Elections Ashok Babu Kolla

TANA 2023 Elections Tagore Mallineni

TANA 2023 Elections Ravi Kiran Muvva

TANA 2023 Elections Sunil Pantra

TANA 2023 Elections Sirisha Tunuguntla

TANA 2023 Elections Raja Surapaneni