NRI-NRT

నాట్స్ బోర్డు అధ్యక్షుడిగా పిన్నమనేని ప్రశాంత్

నాట్స్ బోర్డు అధ్యక్షుడిగా పిన్నమనేని ప్రశాంత్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 2024-25 బోర్డు ఛైర్మన్‌గా ప్రశాంత్ పిన్నమనేని ఎన్నికయ్యారు. ఇదే కాలానికి గానూ నూతన డైరక్టర్ల బోర్డు సభ్యులను ప్రకటించారు. నాట్స్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నంద కిషోర్ కంచర్ల, కార్యదర్శిగా మధు బోడపాటి వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడాలో నాట్స్ చేస్తున్న కార్యక్రమాల్లో ప్రశాంత్ పిన్నమనేని కీలక పాత్ర పోషిస్తున్నారు. నాట్స్‌లో అంచలంచెలుగా ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం నాట్స్ బోర్డు ఉపాధ్యక్షురాలు అరుణ గంటి నుంచి ప్రశాంత్ పిన్నమనేని నూతన బోర్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాట్స్ లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రశాంత్ తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అరుణ గంటి ధన్యవాదాలు తెలిపారు.నాట్స్ సలహా సంఘానికి కూడా నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు.


#######

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z

TANA 2023 Elections Ashok Babu Kolla
TANA 2023 Elections Sunil Pantra
TANA 2023 Elections Ravi Kiran Muvva
TANA 2023 Elections Sirisha Tunuguntla
TANA 2023 Elections Raja Surapaneni
TANA 2023 Elections Tagore Mallineni