Business

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక సూచన

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక సూచన

డిజిటల్‌ ప్రపంచంలో డేటా భద్రత ఎంతో ముఖ్యం. యూజర్లు అప్రమత్తంగా లేకుంటే.. ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్‌ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. యూజర్ల భద్రత కోసం గూగుల్ (Google) ఎప్పటికప్పుడు మాల్‌వేర్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ (Play Store) నుంచి తొలగిస్తుంది. తాజాగా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫే (McAfee) నివేదిక ఆధారంగా 13 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను తమ ఫోన్‌ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది.

గూగుల్‌ తొలగించిన ఈ 13 యాప్‌లలో హెల్త్‌, గేమింగ్‌, రాశి ఫలాలు, ప్రొడక్టివిటీకి సంబంధించిన యాప్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ యాప్‌లను ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సోషల్‌ ఇంజినీరింగ్ సాయంతో యూజర్‌ ప్రమేయం లేకుండా డివైజ్‌ను యాక్సెస్‌ చేసుకుని, ఆండ్రాయిడ్ చేసే అన్ని రకాల అలర్ట్‌ మెసేజ్‌లను డిజేబుల్ చేస్తాయి. తర్వాత సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని.. ప్రకటనలపై క్లిక్‌ చేయడం, మోసపూరిత ఆర్థిక లావాదేవీలను నిర్వహించే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మెకాఫే తెలిపింది. వీటివల్ల యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం ఇతరుల చేతికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ యాప్‌లను వెంటనే ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు ఎవరైనా ఈ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉంటే డిలీట్‌ చేయాలని సూచించింది. ఆ 13 యాప్‌ల వివరాలివే..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z