DailyDose

ఇదంతా దొంగల ముఠా నిర్వాకం

ఇదంతా దొంగల ముఠా నిర్వాకం

బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న వారే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడటం.. ఆ తర్వాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం.. ఇందుకోసం కొట్టేసిన సొమ్ములో రూ. 25 వేల వరకు వినియోగించడం.. ఇదంతా ఓ దొంగల ముఠా నిర్వాకం. ఇటీవల ముఠాలోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముఠాలోని ఆరుగురికి మూడంతస్తుల ఇళ్లు ఉన్నట్లు తేలింది. వారందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్‌ జిల్లాలో వెలుగుచూసింది. ‘‘బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న వారి నుంచి ఆరుగురు సభ్యుల దొంగల ముఠా నగదు లాక్కుంటుంది. ఇలా.. ఇప్పటివరకు రూ.లక్షల్లో డబ్బు దోచుకుంది. ఆ సొమ్ములో రూ.25వేలను పూజల కోసం వినియోగించింది. ఇటీవల ఈ బృందంలోని ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. విచారణలో అతను ఈ విషయాలను వెల్లడించాడు. ముఠాలోని మిగిలినవారిని త్వరలో పట్టుకుంటాం’’ అని మౌగంజ్‌ పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z