Politics

వచ్చే వారం TDP-BJP-JSP పొత్తులపై స్పష్టత

వచ్చే వారం TDP-BJP-JSP పొత్తులపై స్పష్టత

ఏపీ పొత్తుల అంశంపై క్లారిటీ ఇవ్వనుంది బీజేపీ అధిష్టానం. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది. ఎన్నికల సమీపిస్తుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలని భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై స్పష్టతనిచ్చి ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై తాడోపేడో తేల్చుకునేందుకు మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి పిలిపించి మరోసారి పొత్తులపై డిస్కస్ చేయనున్నారు.

విశాఖ టూర్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా.. ఢిల్లీ నుంచి పిలుపు రాగానే హస్తిన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ హైకమాండ్ తో చంద్రబాబు, పవన్ సమావేశమై పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టతకు రానున్నారు. అన్నీ కుదిరితే వచ్చే వారమే పొత్తులపై కీలక ప్రకటన చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3వేల మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశాశహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z