NRI-NRT

సింగపూర్: స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవములు

సింగపూర్: స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో రెండవ త్యాగరాజ ఆరాధనోత్సవములు

సోమవారం నాడు స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగు గాయనీగాయకులు త్యాగరాజ ఆరాధనోత్సవములు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం గత ఏడాది కూడా నిర్వహించారు. ఈ ఏడాది రెండోసారి నిర్వహించారు. యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, సౌమ్య, కిరిటి, శేషశ్రీ తదితరులు ఘన రాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు. యడవల్లి శ్రీ విద్య తెర తీయగ రాదా, ఆరగింపవే, పతికి మంగళ హారతీరే త్యాగరాజ స్వామి కీర్తనలు ఆలపించారు. అనంతరం స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన శేషుకుమారి జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z