Editorials

కృష్ణా జిల్లా పెనమలూరులో గుంటూరు జిల్లా తెనాలి రాజకీయం

కృష్ణా జిల్లా పెనమలూరులో గుంటూరు జిల్లా తెనాలి రాజకీయం

పెనమలూరు అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీలో పీటమూడి వీడకపోగా, అటూ ఇటూ తిరిగి ఇప్పడు తెనాలి రాజకీయం దగ్గర ఆగింది. పెనమలూరు సీటు విషయంలో మాజీ మంత్రి ఆలనాటి రాజాను తుది ఎంపిక చేసేందుకు చంద్రబాబు సిద్దమైయ్యారు. అయితే అదే ప్రాంతానికి హీరో కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సీటు తమకు కేటాయించాల్సిందేనంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఆలపాటికి కాకుండా ఎవరికీ ఇచ్చిన పర్వాలేదని, ఆయనకే సీటు కేటాయించేలా ఉంటే ముందు తమకే కేటాయించాలని ఆదిశేషగిరిరావు చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ప్రజాగళం సభ తర్వాత వీరిరువురి ఆర్థిక బలాబలాలపై హైకమాండ్ విస్తృతంగా చర్యలు జరుపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అభ్యర్థి ఎంపిక తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే ఆదిశేషగిరిరావు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులకి పోన్లు చేసి పెనమలూరులో పోటీచేస్తే గెలుపు అవకాశాలపై సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఆలపాటి అయితే ఏకంగా తన టీంను పెనమలూరులో తిప్పుతున్నారు. బోడే ప్రసాద్‌కు టిక్కెట్టు ఇచ్చే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేసినట్లేనని సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z