Politics

విషమించిన ములాయం సింగ్ ఆరోగ్యం ఆసుపత్రికి వెళ్లిన అఖిలేష్

విషమించిన  ములాయం సింగ్ ఆరోగ్యం ఆసుపత్రికి వెళ్లిన అఖిలేష్

ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మణిపుర్ గవర్నర్ లా గణేశన్ అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హరియాణాలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆదివారం ఆయనను ఐసీయూ వార్డుకు తరలించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ములాయం కుమారుడు, ఎస్పీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్.. మేదాంత ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన సోదరుడు శివపాల్ యాదవ్​ సైతం గురుగ్రామ్​కు బయలుదేరారు.82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఆగస్టు 22 నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్‌ నితిన్‌ సూద్‌, డాక్టర్‌ సుశీల్‌ కటారియా పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. ‘ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య క్షీణించడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ఆయన త్వరగా కోల్కోవాలని ప్రార్థిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.