DailyDose

కోటపల్లి ప్రాజెక్టులో ఈతకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.

కోటపల్లి ప్రాజెక్టులో ఈతకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు  మృతి.

వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందారు. సంక్రాంతి పండుగను సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి మృతి ఒడికి చేరుకున్నారు పండుగ వేళ వీరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతులు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్, లోకేష్, రాజేష్, వెంకటేష్ చనిపోయినట్లుగా గుర్తించారు.