విజయశాంతి, నయనతార, తాప్సి మాదిరిగా కథా ప్రాధాన్యం ఉన్న ప్రధాన పాత్రల్లోనే ఇకపై నటిస్తానంటోంది హన్సిక. తెలుగు, తమిళ భాషల్లో అందాలతారగా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు హీరోలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ‘ధర్మప్రభు’ చిత్రాన్ని నిర్మించిన శ్రీవారి ఫిలిమ్స్ బ్యానరుపై పి.రంగనాథన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో హన్సిక నటిస్తోంది. క్రికెటర్ శ్రీశాంత్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి నటుడిగా అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన నెగిటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారని చిత్రవర్గాలు ప్రకటించాయి. ‘అంబులి’, ‘జంబులింగం’ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హరి-హరిష్ దర్శక ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులో చిత్రీకరణ మొదలుకానుంది. 2020 వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కోసం పోరాట సన్నివేశాల కోసం హన్సిక ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
వాళ్ల లానే నేను కూడా
Related tags :