తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, నారా లోకేశ్, కనకమేడల రవీంద్ర, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, కాలువ శ్రీనివాసులుతో పాటు పలువురు తెదేపా నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు.