Devotional

16 నుండి శబరిమలలో సేవలు ప్రారంభం

16 నుండి శబరిమలలో సేవలు ప్రారంభం

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమవుతాయి.

ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తారు.

శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని నడుపుతున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16న దేవస్థానాన్ని తెరుస్తారు.

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం ఈ దేవాలయాన్ని తెరవడం ఇదే మొదటిసారి.

నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని బోర్డు తెలిపింది.

గరిష్ఠంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది.

భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.