NRI-NRT

ఘనంగా TANTEX172వ సాహిత్య సదస్సు

ఘనంగా TANTEX172వ సాహిత్య సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) ఆధ్వర్యంలో 172వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ముఖ్య అతిథిగా డా.కొంపెల్ల భాస్కార్ హాజరై “విశ్వనాథ నవలల్లో స్త్రీ పాత్రలు” అనే అంశంపై ప్రసంగించారు. మాడ సమన్విత ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. అధ్యక్షురాలు పాలేటి లక్ష్మీ అన్నపూర్ణ, ఉపద్రష్ట సత్యం, యు.నరసింహారెడ్డి, అరవిందారావు, అరుణజ్యోతి, నీరజా కుప్పచ్చి, మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, స్థానిక తెలుగు సాహితీ ప్రియులు హాజరై పలు అంశాలపై ప్రసంగించి, చర్చించారు.