Politics

పేదరికంతో ప్రజలు వైద్యానికి దూరం కాకూడదు

పేదరికంతో ప్రజలు వైద్యానికి దూరం కాకూడదు

వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. అనంతరం అల్వాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో కరోనాలాంటి మహమ్మారిలాంటి వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరి ఏం చేయాలంటే ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ, ఒక నగరం గానీ ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు తక్కువ నష్టం బయటపడుతారనీ, వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారన్నారు. వైరస్‌లను మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్‌ చేసే వైద్య విధానం ఉందన్నారు.

వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవీయకోణంతో చాలా కష్టపడి.. పోరాడి.. ఆరుదశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి.. దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్ట పరిచేందుకు సరైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు మిగతా పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయని, మనం మాత్రం కంటోన్మెంట్‌ సికింద్రాబాద్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎవరు చనిపోయినా వారింటికి తీసుకెళ్లేలా వాహనాలు ఏర్పాటు చేశామని, 50, 60 వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.

వైద్య విధానాన్ని పటిష్ట పరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని, హెచ్‌ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించామని, అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు ప్రజలకు అందుతాయన్నారు. అల్వాలలో మహిళల ప్రసూతి వింగ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు వైద్యశాఖకు సూచనలు చేశారు. హైదరాబాద్‌ నలుమూలలా వైద్యసేవలు ఉచితంగా అందుతాయని, హైదరాబాద్‌లో ఆరువేల పడకల ఆక్సిజన్‌ సౌకర్యం ఉందన్నారు. 1500 వరకు ఐసీయూ బెడ్స్‌ ఉండేలా ఆసుప్రతుల నిర్మాణం జరుగుతుందన్నారు. దోపిడీకి గురికాకుండా పేదలు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యసేవలు పొందాలన్నారు.