Politics

రఘురామరాజు తూలిపోయారు

రఘురామరాజు తూలిపోయారు

వైసీపీ ఊగుతోంది.. అదేంటని అవాక్కయ్యారా? అంటే ఫ్యాన్ ఊగడంకాదని, కార్యకర్తలు, అభ్యర్థులు ఇప్పుడు ఏపీలో ఊగిపోతున్నారు. ఊగిపోవడం అంటే కోపం ఎక్కువై కాదు.. మందు కిక్కు ఎక్కువై.. ఆయనొక పెద్ద పారిశ్రామిక వేత్త, ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన నేత, టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీ నుంచి నరసాపురంలో లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయనే రఘురామ కృష్ణంరాజు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ సమావేశంలో ఆయన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఓ సమావేశంలో ఊగిపోతూ, తడబడుతూ మాట్లాడడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్న రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత తిరిగి వైసీపీలో చేరారు. నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కానీ ఓ సమావేశంలో ఆయన ఇలా ఊగిపోతూ కనిపించడం చర్చకు దారి తీసింది. రఘురామ కృష్ణం రాజు మందుపుచ్చుకున్నారని కిక్కు ఎక్కువై అలా ఊగిపోయారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ కార్యకర్తలే కాదు. అభ్యర్థులకు కిక్కు ఎక్కువైందంటూ సోషల్ మీడియాతో కామెంట్లు వినిపిస్తున్నాయి.