Politics

ఆంధ్రాబ్యాంకు విలీనం దారుణం-ఎంపీ బాలశౌరి

ఆంధ్రాబ్యాంకు విలీనం దారుణం-ఎంపీ బాలశౌరి

ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేయడంపై వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రాబ్యాంక్‌ విలీనాన్ని నిరసిస్తూ ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్‌ విలీనం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని లేఖలో మండిపడ్డారు. విలీనంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరాలోచన చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల్లో భాగంగా ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు కార్పొరేషన్‌ బ్యాంకును కూడా యూబీఐలో కలపనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ను గతంలోనే ఎస్‌బీఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే.