NRI-NRT

డీసీలో మూడురోజుల పాటు మహాత్ముని జయంత్యుత్సవాలు

Washington DC NRTs Celebrate Mahatma Gandhi Jayanthi

వాషింగ్టన్ డీసీ ప్రవాసుల ఆధ్వర్యంలో అక్టోబర్ 1,2,3 తేదీల్లో మహాత్మ గాంధీ 150వ జయంతి పురస్కరించుకుని మూడురోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు జరిగిన కార్యక్రమంలో తెదేపా నాయకుడు మన్నవ సుబ్బారావు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచానికి శాంతి అహింస ఒక్కటే ఆయుధమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో అహింసకు పెద్దపీట వేసిన మహోన్నతుడు గాంధీజి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాగులూరి భానుప్రకాష్, ప్రఖ్యా చంద్రశేఖర్, ఏగిరెడ్డి పాపారావు, వీర్రాజు, అంజిరెడ్డి, భగవాన్‌రెడ్డి, మోహన్‌రావు, సోమరాజు, పరమేశ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.