Devotional

తిరుమల ఆలయంపై రెండు రోజులుగా విమాన సర్వే

TTD Priests Object To Flights Above Temple Air

తిరుమలలో శ్రీవారి ఆలయం పై చార్టెడ్ విమానం గగనయానం చేసింది.

ఇది గమనించిన భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శ్రీవారి అలయంపైకి అతి దగ్గరగా వెళ్లిన విమానాన్ని గమనించిన భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు

ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయంపై విమానాల రాకపోకలు నిషేధం అయినప్పటికీ గత రెండు రోజులుగా విమానం రాకపోకలు సాగిస్తున్నాట్లు సమాచారం.

భౌగోళిక పరిస్థితుల కోసం ASOI సర్వే చేయిస్తున్న నేషనల్ సర్వే ఆప్ ఇండియా సర్వేలో భాగంగా తిరుమలలో గగనయానం చేసినట్లు తెలిసింది.

మరోవైపు ఇది ఆగమ విరుద్ధమని ఆగమ పండితులు అంటున్నారు.

చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి టీటీడీ పిర్యాదు చేసింది.

గతంలో తిరుమలకు నో ఫ్లైయింగ్ జోన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది.