Devotional

యాదాద్రిలో కరోనా

Corona Positive Cases Identified in Yadadri District

ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఆత్మకూరు(ఎం) మండలంలో 3 పాజిటివ్‌ కేసులు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు వెల్లడించారు. వీరంతా ముంబయి నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారేనని తెలిపారు. కరోనా సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.