Business

ఆర్థిక మంత్రి మూడో రోజు ప్రకటించిన ప్యాకేజీ వివరాలు

Nirmala Sitharaman Third Day Package Announcements

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్.

మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇందులో 8 మౌలిక వసతుల బలోపేతం, నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించినవి కాగా.. 3 పరిపాలనాపరమైన సంస్కరణలు ఉన్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయింపు సహా మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా మత్స్య సంపద యోజన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు నిర్మల.

మౌలిక వసతుల అభివృద్ధికి 8 చర్యలు

1. లక్ష కోట్ల నిధి

మౌలిక వసతుల అభివృద్ధికి సాధ్యమైనంత త్వరలో లక్ష కోట్ల నిధి ఏర్పాటు

అగ్రిగేటర్లు, కో-ఆప్​లు ద్వారా నిధుల అందజేత

కోల్డ్ స్టోరేజ్​లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలు, స్టార్టప్​లు

2. మైక్రో ఫుడ్ ఎంటర్​ప్రైజెస్​కు

మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం 10 వేల కోట్ల నిధి

ప్రధాని చెప్పిన ‘వోకల్ ఫర్ లోకల్’ సాకారం చేసే దిశగా కేటాయింపులు

స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి విపణులకు చేర్చేందుకు నిధితో సాయం

దేశవ్యాప్తంగా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్ల ఏర్పాటు

స్థానికంగా ఉన్న ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్

రెండు లక్షల మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​కు ప్రయోజనం

3. మత్స్యకారులకు

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు రూ.20 వేల కోట్లు

ఆక్వాకల్చర్​ కోసం 11 వేల కోట్లు కేటాయింపు

మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు

ఈ చర్యలతో రానున్న ఐదేళ్లలో అదనంగా 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి

55 లక్షల మందికి ఉపాధి

ఎగుమతుల విలువ రెట్టింపై లక్ష కోట్లకు చేరే అవకాశం

4. పశు వ్యాధుల నియంత్రణ

ఇప్పటికే రూ.13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభం

పశువులన్నింటికీ 100 శాతం టీకాలు ఇవ్వడం లక్ష్యం

ఎఫ్​ఎండీ, బ్రూసెలోసిస్ ​నుంచి దేశంలోని 53 కోట్ల పశువులను రక్షించేలా టీకాలు

ఇప్పటివరకు కోటిన్నర ఆవులు, గేదెలకు టీకాల పూర్తి…

లాక్​డౌన్​ ఉన్నా గ్రీన్​జోన్​లో కార్యక్రమం అమలు

5. పశు సంవర్థక రంగ మౌలికం

రూ.15 వేల కోట్లతో పశు సంవర్థక రంగ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు

పాడి పరిశ్రమలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రయత్నం

పాడి అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు

6. ఔషధ మొక్కల పెంపకం

ఔషధ విలువలున్న మొక్కలు పెంపకానికి రూ.4వేల కోట్లు

రానున్న రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో సాగు

రైతులకు రూ.5 వేల కోట్ల ఆదాయం

గంగా నది ఒడ్డున 800 హెక్టార్లలో ఔషధ మొక్కల కారిడార్ అభివృద్ధి

7. తేనెటీగల పెంపకం

తేనెటీగల అభివృద్ధి, నిల్వ కేంద్రాలు సహా ఇతర సౌకర్యాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి

రూ.500 కోట్లతో పథకం అమలు

పాలినేషన్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు

ఆదాయం పెరుగుదలతో 2 లక్షల మందికి తేనెటీగల పెంపకందారులకు లబ్ధి

8. టాప్​ టు టోటల్

టమాట(టీ), ఉల్లిపాయలు(ఓ), బంగాళ దుంపలకు వర్తించే ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని అన్ని పళ్లు, కూరగాయలకు(టోటల్) వర్తించేలా మార్పులు చేశారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.

టాప్​ టు టోటల్​ పథకానికి అదనంగా రూ.500 కోట్లు

రవాణా, కోల్డ్ స్టోరేజ్ సహా గోదాముల ఖర్చుపై 50శాతం రాయితీ

6 నెలల పైలట్​ పథకంగా అమలు

దీని ద్వారా రైతలకు మెరుగైన ధర

వృథాను నివారించడం సహా వినియోగదారులకు చౌక ఉత్పత్తులు అందించడమే లక్ష్యం