Agriculture

కొండపోచమ్మ రిజర్వాయిర్ వద్ద చండీయాగం ప్రారంభం

KCR To Attend Chandee Yagam At Konda Pochamma Reservoir

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహిస్తున్నారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్‌ పంప్‌హౌజ్‌ వద్ద సుదర్శన యాగం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4:30 గంటలకు స్థానిక సర్పంచ్‌ రజిత రమేశ్‌, కొండపోచమ్మ దేవాలయ ఛైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి ఈ యాగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ దంపతులు ఉదయం 7 గంటలకు కొండ పోచమ్మ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామీ పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.