Sports

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు కరోనా

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు కరోనా

పాకిస్థాన్ కు చెందిన 20 మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన తర్వాత పాక్ జట్టు బ్రిటీష్ గడ్డపై అడుగుపెట్టింది. ఇంగ్లండ్ కు వెళ్లిన పాక్ ఆటగాళ్లలో 6 మందికి కరోనా సోకింది. దీంతో మరో ముగ్గురు ఆటగాళ్లు ఇంగ్లాండ్ కు వెళ్లారు. వీరిలో ఆల్ రౌండర్ కాశీఫ్ భట్టీ కూడా ఉన్నాడు. ఇంగ్లాండ్ కు వెళ్లడానికి ముందు పాక్ లో అతనికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయితే… అక్కడకు వెళ్లిన తర్వాత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐపొలేషన్ కు వెళ్లాలని అతడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కోరింది. వచ్చే నెల 5 నుంచి ఇంగ్లాండ్-పాకిస్థాన్ దేశాల మధ్య మూడు టెస్టులు జరగనున్నాయి. వీటిని బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.