ఓ వైపు కరోనా మహమ్మారితోనే సతమతమవుతుంటే.. చైనాలో మరో కొత్త అంటువ్యాధి బయటపడింది.
టిక్ బార్న్ వైరస్ కారణంగా వ్యాప్తి చెందే వ్యాధితో ఇప్పటికే ఏడుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. మరో 60 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మరో కొత్త అంటువ్యాధి బయటపడింది.
టిక్-బార్న్ (గోమార్లు) వైరస్తో కొత్త అంటువ్యాధి సోకి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
మరో 60 మంది వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
ఈ వైరస్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
జియాంగ్ఝు రాజధాని నాన్జింగ్కు చెందిన ఓ మహిళ వైరస్ బారినపడగా.. ఆమెలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయని, శరీరంలో ల్యూకోసైట్, రక్తంలో ప్లేట్లెట్లు క్షీణించినట్లు వైద్యులు గుర్తించారు.
ఒక నెల రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు.
అయితే.. ఎస్ఎఫ్టీఎస్ వైరస్ కొత్తది కాదని.. 2011లోనే ఈ వైరస్ను గుర్తించినట్లు మీడియా పేర్కొంది. బన్యావైరస్ వర్గానికి చెందినదిగా పేర్కొంది.
టిక్స్ (గోమార్లు)తో మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అటువ్యాధుల నిపుణులు బావిస్తున్నారు.
టిక్ కాటు ద్వారానే ప్రధానంగా ఈ వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.