గుంటూరు నగరంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రహదారి పక్కన నివసించే నిరాశ్రయులకు ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణ దుప్పట్లు, మాస్క్లు తదితర సంరక్షక సామాగ్రిని అందించారు. దోమల వలన ప్రబలే వ్యాధుల నుండి వీరికి ఇవి రక్షణగా నిలుస్తాయని మన్నవ ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అరండళ్పేట, బ్రాడిపేట తదితర ప్రాంతాల్లో సంతోష్, అఖిల్, నితీష్, అనంత్, నాగూర్ తదితరులు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుంటూరు నిరాశ్రయులకు మన్నవ చేయూత
Related tags :