* రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదలతిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను టిటిడి బుధవారం సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేసింది. సెప్టెంబరు 10 నుండి 30వ తేదీ వరకు అదనంగా రోజుకు 3 వేల టికెట్లు చొప్పున ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆఫ్లైన్లో ఇస్తున్న సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సెప్టెంబరు 30వ తేదీ వరకు టిటిడి తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల కోరిక మేరకు అదనంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.
* శ్రీవారి ఆన్లైన్ కల్యాణోత్సవానికి విశేష స్పందనతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆన్లైన్ కల్యాణోత్సవ సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో భక్తులు నేరుగా కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7న ఈ సేవను టిటిడి ప్రారంభించింది.అప్పటినుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు నెల రోజుల్లో 8,330 టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు.ఆగస్టు 15వ తేదీన అత్యధికంగా 1,012 టికెట్లను భక్తులు బుక్ చేసుకుని ఆన్లైన్ సేవలో పాల్గొన్నారు.ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు టిటిడి పంపుతోంది.కాగా, ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది.వీరికి సుపథం ప్రవేశమార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తారు.ఈ అవకాశాన్ని ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులు వినియోగించుకోవాలని టిటిడి కోరుతోంది.