NRI-NRT

అంధుల పాఠశాలకు వల్లేపల్లి దంపతుల తోడ్పాటు

Vallepalli Priyanka And Sasikanth Helps Blind Home Run By Spoorthi Jyothi Foundation Ibraheempatnam

ప్రవాసాంధ్ర ప్రముఖుడు, హైదరాబాద్‌కు చెందిన Qhub సంస్థ వ్యవస్థాపకుడు వల్లేపల్లి శశికాంత్-ప్రియాంక దంపతులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలకు గణతంత్ర దినోత్సవం నాడు చేయూతనందించారు. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 39మంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు, నిత్యావసరాలను అందజేశారు. దీనికి పూర్వం జెండావందనం కార్యక్రమంలో విద్యార్థులతో వల్లేపల్లి దంపతులు పాల్గొన్నారు. వీరి చేయూతకు ఫౌండేషన్ నిర్వాహకుడు పొట్లూరి గంగాప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
అంధుల పాఠశాలకు వల్లేపల్లి దంపతుల తోడ్పాటు-Vallepalli Priyanka And Sasikanth Helps Blind Home Run By Spoorthi Jyothi Foundation Ibraheempatnam