Sports

భారత బాక్సింగ్ సంచలనం…దీపక్

భారత బాక్సింగ్ సంచలనం…దీపక్

భారత బాక్సర్‌ దీపక్‌ కుమార్‌ సంచలన ప్రదర్శన చేశాడు. స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో పురుషుల 52 కేజీల సెమీస్‌లో అతను.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ జోరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)కు షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన దీపక్‌ 4-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మహిళల విభాగంలో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జ్యోతి గులియా (51 కేజీలు), భాగ్యవతి కచారి (75 కేజీలు) తమ బౌట్లలో ఓడిపోయారు. జ్యోతి 0-5తో పెరిజోక్‌ (రొమేనియా) చేతిలో, భాగ్యవతి కూడా అంతే తేడాతో గుర్గెన్‌ (అర్మేనియా) చేతిలో పరాజయం చెందారు. పురుషుల 91 కేజీల పైన విభాగంలో మంజీత్‌ సింగ్‌ ఓటమి పాలయ్యాడు.