Movies

బాలీవుడ్‌లో శుభముహూర్తం

Rashmika First Day In Bollywood - Tollywood News

తెలుగు చిత్రసీమలో సక్సెస్‌కు చిరునామాగా నిలుస్తోంది రష్మిక మందన్న. టాలీవుడ్‌లో లక్కీస్టార్‌గా అవతరించిన ఆమె అగ్రకథానాయకులతో జోడీకడుతూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె తొలి అడుగు వేసింది. శుక్రవారం ‘మిషన్‌ మజ్ను’ చిత్రీకరణలో పాల్గొన్నది. ఈ సినిమాతోనే ఆమె హిందీ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. “మిషన్‌ మజ్ను’ డే వన్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్న ఆమె తనపై తానే స్వయంగా క్లాప్‌ బోర్డ్‌ కొడుతున్న వీడియోను పోస్ట్‌చేసింది. ‘ఆనందం, భయం, ఉత్సుకత అన్ని ఉద్వేగాలు కలగలసిన క్షణమిది’ అంటూ తెలిపింది. లక్నోలో సిద్దార్థ్‌ మల్హోత్రా, రష్మిక మందన్నతో పాటు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. గూఢచార్యం నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘రా’ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. రష్మిక మందన్న పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’ చిత్రంలో రష్మిక నటిస్తోంది.