సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. జూమ్ మరియు యూట్యూబ్ వేదికగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మిక సోదరులు పాల్గొన్నారు. పూర్వ మరియు ప్రస్తుత కార్యవర్గసభ్యులతో పాటు సినీహీరో మంచు విష్ణు కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ, సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోవిద్ పరిస్ధితులో సింగపూర్ ప్రభుత్వ తీసుకొంటున్న జాగ్రత్తలను కొనియాడారు. ఇలాంటి క్లిష్టపరిస్ధితులో అందరూ ధైర్యంగా , కలసికట్టుగా ఉంటూ చేతనైనంతలో సాయపడదామని పిలిపునిచ్చారు.
సింగపూర్లో నివశించే ప్రవాస కార్మికులందరికీ ఉపయోగపడేట్లుగా, భారత హైకమీషన్ నేతృత్వంలో వివిధ సంస్ధల సహకారంతో ఒక బృహత్తర ప్రణాళికను త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. స్ధానిక రెస్టారెంట్స్ సహకారంతో , కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 800 మంది కార్మిక సోదరులకు బిర్యాని బాక్స్లు అందించామని, సహకరించిన రెస్టారెంట్స్ యాజమాన్యాలకు సహనిర్వాహకులు నరసింహగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మేడేని పురస్కరించుకొని, రెడ్ క్రాస్ సంస్ధ సహకారంతో ఆదివారం నాడు హెల్త్ సైన్సెస్ అధారిటి ప్రాగణంలో రక్తదానశిబిరం నిర్వహించగా సుమారు 85 దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తనం చేశారని, వారికి సహ నిర్వాహకులు మేరువ కాశయ్య ధన్యవాదములు తెలిపారు.
కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.