Business

ఇక నుండి కేక పెట్టనున్న కోకాపేట

ఇక నుండి కేక పెట్టనున్న కోకాపేట

దేశంలో అత్యున్నత నగరాలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని పురపాలక శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) కమిషనర్ శ్రీ అర్వింద్ కుమార్ అన్నారు.

శుక్రవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐసిఐసిఐ టవర్స్ లో జరిగిన “కోకాపేట్ ఈ- ఆక్షన్ ఫ్రీ బిడ్ మీటింగ్” కు హాజరైన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, డెవలపర్స్ లను ఉద్దేశించి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి జోనల్ రిస్ట్రిక్షన్స్ లేని మల్టీ యూజ్ జోన్ “కోకాపేట్ హెచ్ఎండిఎ లేఅవుట్” గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలిపారు.

వంద అడుగుల రోడ్లు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్
వ్యవస్థలతో అధునాతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లను కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా కోకాపేట్ ఏరియాకు ముద్ర పడిందని,
వచ్చే రెండు దశాబ్దాల కాలంలో కోకాపేట్ పరిసరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5.3 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ట్రాన్స్ కో కు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 400/220/132/33 కెవి సామర్ధ్యం సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు.

కోకాపేట్ లేఅవుట్ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం కొల్లూరు నుంచి ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్ ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. వాటర్ వర్క్స్ బోర్డు పంప్ హౌస్ నిర్మాణానికి 9.30 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు.

అవుటర్ రింగ్ రోడ్డు (ఓఅర్అర్) నుంచి కోకాపేట్ లేఅవుట్ లోకి నేరుగా వాహనాలు చేరుకునేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నట్లు అర్వింద్ కుమార్ తెలిపారు.

భవిష్యత్తులో కోక పేట లేఅవుట్ లో వచ్చే బహుళ అంతస్తుల నిర్మాణాలు, అందులో పని చేసే ఉద్యోగులు, అక్కడి జనసాంద్రతతకు అనుగుణంగా ట్రంపెట్ నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు అర్వింద్ కుమార్ వివరించారు.

కోకాపేట్ లే అవుట్ లో నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారా 15 నుంచి 21రోజుల్లో అనుమతులు లభిస్తాయని, అక్కడి నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) పరిమితి ఉండదని అర్వింద్ అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పలువురు డెవలపర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే వారి సందేహాలను నివృత్తి చేశారు.

ప్రీపెయిడ్ సమావేశంలో హెచ్ఎండిఎ సెక్రెటరీ సంతోష్ ఐఏఎస్, చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్(సిఎఓ) విజయలక్ష్మి, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్డీ రాంకిషన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.