అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అమరావతి రైతు పాదయాత్ర ఆదివారం నాడు తిరుపతి చేరుకుంది. ఈ యాత్రలో డెట్రాయిట్కు చెందిన చిత్తూరు జిల్లా ప్రవాసాంధ్రుడు పంత్ర సునీల్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. వీరి ఒకరోజు భోజన ఏర్పాట్లకు లక్షన్నర రూపాయిలు విరాళంగా అందజేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.