NRI-NRT

తిరుపతి వైద్యశాలకు అమెరికా ప్రవాసుడి విరాళం

తిరుపతి వైద్యశాలకు  అమెరికా ప్రవాసుడి విరాళం

అమెరికాలోని శా‌న్‌ప్రాన్సిస్కోలో ఉంటున్న ప్రవాస భారతీయులు కేదార్నాథ్, గీతాకృష్ణ దంపతులు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. ఈ దంపతుల రెండు సంవత్సరాల కుమార్తెకు హైపో ఆక్సిక్ బ్రెయిన్ డామేజ్ కారణంగా మెదడు ఎదుగుదల లోపం వల్ల బుద్ధిమాంద్యం అనే రుగ్మత ఏర్పడింది. ఆయుర్వేద కళాశాలలోని చిన్న పిల్లల విభాగంలో వీరి పాపకు అడ్మిషన్ పొంది పంచకర్మ చికిత్స చేయించారు. ఈ చికిత్స విధానం, ఇక్కడి వైద్య సేవలపై వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి అవసరమైన రూ.75000 విలువైన వైద్య పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ కు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత, స్టాఫ్ నర్సులు స్వర్ణ, హేమసుధ పాల్గొన్నారు.