అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(TANTEX) ఆధ్వర్యంలో ఆదివారం నాడు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి, వనితా వేదిక సభ్యులు కళ్యాణి తాడిమేటి, కార్యనిర్వాహక బృంద సభ్యులు, లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, శరత్ రెడ్డి ఎర్రం, సురేష్ పఠనేని , నీరజ కుప్పచ్చి, స్రవంతి యర్రమనేని, మాధవి లోకిరెడ్డి, శ్రీనివాసులు బసాబత్తిన , రఘునాథ రెడ్డి కుమ్మెత , శ్రీనివాస పాతపాటి , సరిత ఈదర, తదితరులు, పాలక మండల ఛైర్మన్ వెంకట్ ములుకుట్ల, ఉపాధ్యక్షుడు అనంత్ మల్లవరపు, సభ్యులు గీతా దమ్మన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200మందికిపైగా స్థానిక మహిళలు హాజరయ్యారు.
గాయకులు ఫ్రభాకర్ కోట, ఆకాష్ కోటాల సంగీత విభావరి అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో, తెలుగు పాఠ్యపుస్తకాలు రచించి తెలుగు భాషకి ఎన్నో సేవలు అందించిన రచయిత్రి బలభద్రపాత్రుని రమణి, సమాజ సేవలకుగాను వైద్యులైన డా.పారో ఖౌష్, డా. సుజాత క్రిష్నన్, డా.సుప్రియలను సత్కరించారు.
కాలిన్ కౌంటీ కమీషనర్ సుసాన్ ఫ్లెచర్, సోషియాలజీ ప్రొఫెసర్ నందిని వెలగపూడి, ప్రతినిధి సభ అభ్యర్థి, క్రోండా ఠిమెస్చ్, నాటా అధ్యక్షుడు డా.శ్రీధర్ కోర్సపాటి, డా.ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయి ప్రసంగించారు. ఏప్రిల్ 16న సంస్థ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు కార్యవర్గం ప్రకటించింది.
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
Related tags :