కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా చివరి రోజు ఆటలో భారత్ ఖాతాలో మరో స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ బంగారు పతకాన్ని సాధించింది. మరోవైపు, టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు శరత్ కమల్ అచంత పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.