NRI-NRT

మదనపల్లిలో తానా సేవా కార్యక్రమాలు

మదనపల్లిలో తానా సేవా కార్యక్రమాలు

తానా కార్యవర్గ సభ్యుడు కొణిదెల లోకేష్ నాయుడు స్వస్థలం మదనపల్లి పట్టణంలో తానా చైతన్య స్రవంతి సందర్బంగా సేవా కార్యక్రమాలు రెండు రోజుల పాటు నిర్వహించారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వాధ్యక్షులు వేమన సతీష్, 2023 కన్వెన్షన కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పాంత్రా తదితరులు పాల్గొన్నారు.

తానా సాంసృతిక కళోత్సవాలో భాగంగా సింహ మరియు బృందం ప్రదర్శించిన మ్యూజికల్ నైట్ అలరించింది. మొదటి రోజు “చేయూత” “ఆదరణ” కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు 15లక్షల విలువైన కుట్టు మిషన్లు, విద్యార్థినులకు సైకిళ్ళు అందజేశారు. ఎంపిక చేసిన లబ్ది దారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. రెండో రోజు గ్రేస్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచితం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.