Politics

వివేకా వర్ధంతి సందర్భంగా మీడియాతోకుమార్తె సునీత .

వివేకా వర్ధంతి సందర్భంగా మీడియాతోకుమార్తె సునీత .

నాన్నను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది .

ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలి .

కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు .

నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించా .

కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని కూడా తెలుసు .

హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే అన్ని విషయాలు చెప్పా .

సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నా .

నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు .

కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు .

నాన్నకు ఎవరు హత్యచేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతా .

30 ఏళ్ల కిందటి గోడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుంది .

తప్పుచేసిన వారికి తప్పక శిక్ష పడాలి .

విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడటం సరికాదు .

దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలి .

ఎంతోమంది తెలియకుండానే సహకరిస్తున్నారు.. వారికి కృతజ్ఞతలు