Politics

సీనియర్ కాంగ్రెస్ నేత కంచి రామారావు కన్నుమూత..

సీనియర్ కాంగ్రెస్ నేత కంచి రామారావు కన్నుమూత..

ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ మార్క్ పెడ్ చైర్మన్ ఉడా మాజీ చైర్మన్ కంచి రామారావు(84) కొద్దిసేపటి క్రితం ఆయన స్వస్థలం తిరువూరులో మృతి చెందారు.. మొదటి నుండి కాంగ్రెస్ వాదిగా ఉన్న కంచి రామారావు తిరువూరు సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా IFFCO డైరెక్టర్ గా తదితర పదవులు నిర్వహించారు. 2014 ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం లో చేరారు. స్వర్గీయ జలగం వెంగళరావు రోశయ్య రాజశేఖర్ రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ఎన్ జనార్దన్ రెడ్డి తదితర మాజీ ముఖ్య మంత్రులకు ఆయన సన్నిహితుడిగా మెలిగారు..