NRI-NRT

సంబరంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం

సంబరంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం

కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టెక్ మహీంద్ర నుండి శ్రీహర్షుల్ అస్నాని ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి మంచి భవిష్యత్తు లభించాలని ఆకాంక్షించారు. కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ నృత్యంలో విద్యనభ్యసించిన 65మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, చమర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.